ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ - శుభాకాంక్షలతో.. చిరువ్యాపారాలు కుదేలు - paderu greeting cards shops news

రోజు రోజుకీ సామాజిక మాధ్యమాల వాడకం పెరగడంతో.. అస్సలూ ప్రజలు మాట్లాడుకోవడమే మానేశారు. గతంలో పండగలొస్తే సరదాగా ఒకరింటికి వెళ్లి కబుర్లు చెప్పుకునే వారు.. ఇప్పుడు బంధువుల ఇళ్లకి వెళ్లడమే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. మొబైల్​ సంభాషణలు, ఈ గ్రీటింగ్స్​తో పలుకరింపులు లేకుండానే పండగల శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇవ్వన్నీ మర్చిపోవడంతో.. దీనికి అనుసంధానమైన మా అయినా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.

Loss to greeting cards  shops  due to social media  at paderu
పాడేరులో గ్రీటింగ్ కార్డ్స్ వ్యాపారం

By

Published : Jan 1, 2021, 5:35 PM IST

గత ఐదేళ్లుగా నూతన సంవత్సర వేడుకల వల్ల ..గ్రీటింగ్ కార్డులు వ్యాపారులు సన్నగిల్లుపోతున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్​లు, ఫొటోలు, వీడియోలు పంపడంతో.. ఒకరికొకరు సంభాషించుకోవడమే మానేశారు. కొత్త సంవత్సరం వస్తే... గ్రీటింగ్​లు, డైరీలు, పుష్పగుచ్ఛాలు .. కొంటూ మార్కెట్​ అంతా సందడిగా మారేది. ఇప్పుడు ఆ జనమే లేరు. మనిషి కదలకుండానే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.

విశాఖ మన్యం పాడేరులో గ్రీటింగ్ కార్డుల మార్కెట్ బాగా పడిపోయింది. పుష్పగుచ్చాలు, గ్రీటింగ్ కార్డులు, డైరీలు కొనకపోవడంతో పుస్తక దుకాణాలు వెలవెలబోతున్నాయి. పళ్ల వ్యాపారాలు అంతంతా మాత్రంగానే సాగుతున్నాయి. ఫ్యాన్సీ దుకాణాల వద్ద కొత్త వస్తువులు కొనేవారు కనుమరుగయ్యారు. సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం పెరగడంతో వీటి ప్రభావం చిరు వ్యాపారాల మీద పడింది.

ఇదీ చూడండి.ప్రభుత్వ అనుమతులకు సిద్ధమైన కొవాగ్జిన్​ : సుచిత్ర ఎల్ల

ABOUT THE AUTHOR

...view details