విశాఖ జిల్లాలో సింహగిరిపై వేలసిన లక్ష్మీ నరసింహ ఆలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలను ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకు నెలగంట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 24 వరకు జరిగే పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామివారి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. అనంతరం 25 నుంచి జనవరి 3 వరకు రాపత్తు ఉత్సవాల సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరువీధి సేవ జరిపిస్తారు. జనవరి 10 నుంచి 14వ వరకు పవిత్ర గంగధార వద్ద స్వామివారి ధారోత్సవాలు ఘనంగా జరుపనున్నారు. ఈ సందర్భంగా జనవరి 10 నుంచి 15 వరకు స్వామి వారికి జరిపే నిత్య కల్యాణోత్సవం, ఆర్జిత సేవలను రద్దు చేశారు. జనవరి 13 భోగి రోజున గోదాదేవి కల్యాణంతోపాటుగా స్వామివారికి నిత్యకల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు.
సింహగిరిపై ఘనంగా నెలగంట మహోత్సవం - లక్ష్మీ నరసింహ స్వామి సేవలు తాజా వివరాలు
సింహచలవాసుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు కొలువైన సింహగిరిపై నెలగంట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ధనుర్మాస ఉత్సవాలను ప్రారంభించారు.
![సింహగిరిపై ఘనంగా నెలగంట మహోత్సవం long-month festival nelaganta celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9894269-724-9894269-1608096282902.jpg)
సింహగిరిపై ఘనంగా నెలగంట మహోత్సవం
TAGGED:
simhagiri latest news update