ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిబంధనలు పాటించండి.. మాస్కులు తప్పనిసరిగా ధరించండి'

విశాఖ గ్రామీణ జిల్లాలో కొవిడ్ 19 నివారణకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రోజురోజుకు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటంపై.. అవగాహన కల్పిస్తున్నారు.

By

Published : Jul 11, 2020, 3:41 PM IST

lockdown in vishaka rural villeges
కొవిడ్ 19 ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

విశాఖ జిల్లాలోని చోడవరం మండలం గవరవరం గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్​డౌన్ విధించుకున్నారు. గ్రామ కార్యదర్శి పట్నాయక్ సారథ్యంలో సచివాలయ సిబ్బంది, గవరవరం పిహెచ్​సీ వైద్య సిబ్బంది, వాలంటీర్లు ఇంటింటికి తిరిగి మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. లేదంటే జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.

అందరూ లాక్​డౌన్ విధిగా పాటించాలని దండోరా వేయించారు. దుకాణాలను మధ్యాహ్నం రెండు గంటల వరకు మూసివేయాలని కార్యదర్శి తెలిపారు. పక్కనే ఉన్న దేవరాపల్లి మండలంలోని పొరుగు గ్రామాల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో మండల స్థాయి అధికారుల సూచనలతో లాక్​డౌన్ పాటిస్తున్నట్లు కార్యదర్శి పట్నాయక్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details