కళ్యాణ లోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ అనుమతులను రద్దు చేయాలంటూ అఖిల పక్షాల ఐక్య వేదిక ధర్నా చేపట్టారు. అనకాపల్లి మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద తమ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చీమలపాడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ 3 నుంచి 7 వరకు దొంగ రెవెన్యు సర్వే నెంబర్లు సృష్టించి ఇచ్చిన మైనింగ్ లీజులను రద్దు చేయాలన్నారు. తమను సంప్రదించకుండా రవాణా పర్మిట్లు ఇవ్వొద్దని ఆటవీశాఖ డీఎఫ్వో అనకాపల్లి మైన్స్ ఏడీకి సూచించినా... రవాణా పర్మిట్లు ఇచ్చారంటూ అఖిల భారత వ్యవసాయం గ్రామీణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని కోరారు.
'రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి' - కళ్యాణ లోవ రిజర్వాయర్ తాజా వార్తలు
కళ్యాణ లోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని అఖిల పక్షాల ఐక్య వేదిక ధర్నా చేపట్టింది. చీమలపాడు ఫారెస్ట్ మైనింగ్ అనుమతులు ఇచ్చిన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
!['రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి' left parties protest on chimalapadu mining issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9058601-793-9058601-1601900875275.jpg)
ధర్నా చేపట్టిన అఖిల పక్షాల ఐక్య వేదిక