విశాఖ సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో చందనం అరగదీత కార్యక్రమం శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి పాదాల చెంత గంధపు చెక్కను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. 5 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి.. 125 కేజీల చందనాన్ని సిద్దం చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ నెల 26వ తేదిన జరిగే ఉత్సవం అనంతరం ఆ చందనాన్ని స్వామివారికి సమర్పించనున్నారు. ఆంక్షల కారణంగా.. కేవలం 15 మందితో అంతరంగికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. భక్తులకు దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు.
సింహాచలంలో చందనం అరగదీత ప్రారంభం - సింహాచలంలో చందనం అరగదీత కార్యక్రమం
సింహాచలంలో చందనం అరగదీత కార్యక్రమం.. ఆలయ అర్చకుల నడుమ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
![సింహాచలంలో చందనం అరగదీత ప్రారంభం Launch of Sandalwood Maceration program in Simhachalam temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6842453-1080-6842453-1587205920595.jpg)
Launch of Sandalwood Maceration program in Simhachalam temple