ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవాడ చక్కెర కర్మాగారంలో నీటి ఎద్దడి - vizag

గోవాడ చక్కెర కర్మాగారంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. రోజుకు మూడు లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా... 2 లక్షల 25 వేల లీటర్ల  నీరే అందుతోంది. రైవాబ జలాశయం నీటిని  శారదా నదికి విడుదల చేయాలని జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు కర్మాగారం యాజమాన్య సంచాలకులు విక్టర్ రాజు తెలిపారు.

గోవాడ చక్కెర కర్మాగారంలో నీటి ఎద్దడి

By

Published : Apr 18, 2019, 11:47 AM IST

గోవాడ చక్కెర కర్మాగారంలో నీటి ఎద్దడి

విశాఖ జిల్లాలో నీటి ఎద్దడి నెలకొంది. పరిశ్రమల నిర్వహణకు నీటి వసతి లేక సమస్యాత్మకంగా మారింది. గోవాడ చక్కెర కర్మాగారంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. రోజుకు మూడు లక్షల లీటర్ల నీరు అవసరం ఉండగా... 2 లక్షల 25 వేల లీటర్ల నీరే అందుతోంది. ప్రత్యామ్నాయ చర్యల వైపు యాజమాన్యం దృష్టి సారించింది. ఇప్పటికే కర్మాగారంలో 5 బోర్లు ఉండగా మరో 2 బోర్లు వేస్తున్నారు. నీటి ఎద్దడి నివారణకు రైవాబ జలాశయం నీటిని శారదా నదికి విడుదల చేయాలని జిల్లా కలెక్టర్​కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు కర్మాగారం యాజమాన్య సంచాలకులు విక్టర్ రాజు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details