ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముంపు ప్రాంతంలో మాకు ఇళ్ల స్థలాలు వద్దు'

ముంపు ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు వద్దని... కుమారపురం గ్రామస్థులు ఆందోళన చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన వైకాపా నాయకులు కోరారు.

By

Published : Sep 3, 2020, 9:36 PM IST

kumarapuram villagers protest
ఆందోళన చేస్తున్న కమారపురం గ్రామస్థులు

ముంపు ప్రాంతంలో ఇళ్ల స్థలాలు వద్దంటూ.. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని కుమారపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయం కార్యాలయం ముందు గురువారం తమ గోడు వినిపించారు. చెరువు గర్భాన్ని ఆనుకుని ఇళ్ల స్థలాలు కేటాయించారన్నారు.

గత నెలలో కురిసిన వర్షాలకు ఈ ప్రాంతామంతా మునిగిపోయిందని లబ్ధిదారులు వాపోయారు. భవిష్యత్తులో ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని గ్రామానికి చెందిన వైకాపా నాయకులు చిరంజీవి రెడ్డి, బాలక్రిష్ణ రెడ్డి తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details