ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 8, 2019, 2:20 PM IST

ETV Bharat / state

మేకను మింగింది... ప్రాణం పోగొట్టుకుంది

విశాఖ మన్యంలో కొండచిలువ హల్​చల్ చేసింది. ఓ మేక పిల్లను మింగి గ్రామస్తుల చేతిలో హతమైంది. మేక పిల్లను ప్రాణాలతో కాపాడారు.

కొండచిలువ

మేకను మింగింది... ప్రాణం పోగుట్టుకుంది...

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం సింగరాళ్లపాడు కొండ ప్రాంతంలో కాపర్లు మేకలు తీసుకుని సమీప కొండకు వెళ్లారు. ఓ భారీ కొండచిలువ ఓ మేకపిల్లను మింగేసింది. మరో మేకను మింగడానికి యత్నించగా కాపరులు గుర్తించారు. అప్రమత్తమై కర్రలతో కొట్టి కొండచిలువను చంపారు. నోటిని చీల్చి మేక పిల్లను బయటికి తీశారు. మేకపిల్ల ప్రాణాలతో బయటపడటంతో కాపరులు ఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details