ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 22, 2020, 12:11 AM IST

ETV Bharat / state

రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్​ యంత్రం ఏర్పాటు

రైతు భరోసా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో సౌజన్య సూచించారు. పాయకరాపుపేట పరిధిలోని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్​ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎరువులను ఆన్​లైన్​లో ఎలా నమోదు చేసుకోవాలనేది రైతులకు అధికారులు వివరించారు.

kiosk machine kept in payakaraopeta rythu bharosa centres for online booking
కియోస్క్​ యంత్రంతో ఎరువులను ఆన్​లైన్​ బుకింగ్​ చేసుకుంటున్నరైతులు

విశాఖ జిల్లా పాయకరావుపేట పరిధి శ్రీరాంపురం, సత్యవరం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్​ యంత్రాన్ని​ ఏర్పాటు చేశారు. ఎరువులు, పురుగుల మందు కోసం ఆన్​లైన్​లో ఎలా బుకింగ్​ చేసుకోవాలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగంచేసుకోవాలని ఏవో సౌజన్య కోరారు.

ABOUT THE AUTHOR

...view details