ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 16, 2020, 5:11 PM IST

ETV Bharat / state

శివాలయాల్లో కార్తిక మాసం సందడి

విశాఖ జిల్లాలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో సందడి ప్రారంభమైంది. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

karthika masam at vishaka patnam
శివాలయాల్లో కార్తికమాసం సందడి

కార్తీక మాసం మొదటి సోమవారం విశాఖ జిల్లా ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఉదయం నుంచి భక్తులు శివార్చనలో తరించారు. చాలా మంది ఉపవాస దీక్ష చేస్తూ దేవాలయాలలో పూజలు చేశారు.

శివాలయాల్లో కార్తికమాసం సందడి

నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. రోలుగుంట లోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో భక్తులు బారులు తీరారు. అనకాపల్లిలోని సిద్దలింగేశ్వర, భోగ లింగేశ్వర, ఉమా రామలింగేశ్వర, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

శివాలయాల్లో కార్తికమాసం సందడి

ABOUT THE AUTHOR

...view details