కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లోని జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నాతవరం మండలంలోని తాండవ జలాశయం, రావికమతం మండలంలోని కల్యాణపులోవ జలాశయాల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. ఫలితంగా జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కల్యాణలోవ జలాశయం
కల్యాణలోవ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 420 అడుగులు కాగా.. ప్రస్తుతం 459.5 అడుగుల వద్ద నీటిని అధికారులు కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని రోజు సాయంకాలం గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు.