ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జ్ఞానాపురం శ్మశానవాటికలో తగ్గిన రద్దీ - విశాఖపట్నం ముఖ్యంశాలు

విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశానవాటికలో రద్దీ తగ్గింది. కొవిడ్‌ మృత దేహాలతో పాటు వివిధ కారణాల వల్ల చనిపోయిన వారి అంతిమసంస్కారాలు అక్కడే చేస్తుండడం వల్ల కొద్దిరోజులుగా రద్దీగా ఉంది.

జ్ఞానాపురం శ్మశాన వాటిక
జ్ఞానాపురం శ్మశాన వాటిక

By

Published : May 12, 2021, 5:42 PM IST

జ్ఞానాపురం శ్మశాన వాటికలో తగ్గిన రద్దీ

విశాఖపట్నంలోని జ్ఞానాపురం శ్మశానవాటికలో రద్దీ తగ్గింది. కొవిడ్‌ మృత దేహాలతో పాటు వివిధ కారణాల వల్ల చనిపోయిన వారి అంతిమసంస్కారాలు ఇక్కడే చేయడం వల్ల కొద్దిరోజులు రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో పది నుంచి 15 మృతదేహాలు మాత్రమే ఇక్కడకు వచ్చేవి.

గత మూడు వారాలుగా ఈ సంఖ్య దాదాపు పదింతలు పెరిగింది. సగటును వంద వరకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. నగరంలోని కొన్ని శివారు ప్రాంతాల్లోనూ ఇప్పుడు అంత్యక్రియలకు అనుమతించడంవల్ల జ్ఞానాపురం శ్మశాన వాటికపై ఒత్తిడి తగ్గింది.

ABOUT THE AUTHOR

...view details