ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చోడవరం మండలంలో సచివాలయ, పంచాయతీ భవనాలు ప్రారంభం

By

Published : Dec 11, 2020, 7:18 PM IST

జన్నవరం సచివాలయం, సింహాద్రిపురం పంచాయతీ భవనాల ప్రారంభోత్సవంలో.. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్​తో పాటు అనకాపల్లి ఎంపీ సత్యవతి, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. సచివాలయ వ్యవస్థ ఆవశ్యకత, విశిష్టతను ప్రజలకు వివరించారు.

sachivalayam panchayat buildings inauguration
ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు

విశాఖ జిల్లా చోడవరం మండలం జన్నవరం గ్రామ సచివాలయం, సింహాద్రిపురం పంచాయతీ కార్యాలయ భవనాలను కలెక్టర్ వినయ్ చంద్ ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ఎందుకు, ఎలా ఏర్పడింది అనే అంశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డా. బి.సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.

సచివాలయాల ఆవశ్యకత, విశిష్టతను సత్యవతి ప్రజలకు వివరించారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో.. దేశవ్యాప్తంగా రాష్టానికి గుర్తింపు వచ్చిందని తెలిపారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులను.. ఆయా గ్రామాల్లో ఊరేగింపుగా వైకాపా కార్యకర్తలు ప్రారంభోత్సవానికి తీసుకువెళ్లారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details