ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆవు మృత్యువాత ఘటనపై ఏయూ ఎదుట జనసేన నిరసన - andhra university latest news

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆవు మృత్యువాత పడిన ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ గేట్ వద్ద జనసేన నాయకులు గోపూజ చేసి నిరసన తెలిపారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేయడం గాని, గోమాత యజమానికి నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

janasena leaders protest
ఏయూ ఎదుట జనసేన నిరసన

By

Published : Jul 26, 2021, 7:17 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆవు మృత్యువాత పడిన ఘటనపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవటంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ గేట్ వద్ద గోపూజ చేసి తమ నిరసనను తెలిపారు. విశాఖ విశ్వ హిందూ పరిషత్ సైతం తన నిరసనను తెలియజేసింది.

ఏయూ సెక్యూరిటీ గోమాత నిర్బంధంలోకి తీసుకుని చంపడం ఒక నేరమైతే.. సంబంధిత పోలీస్ స్టేషన్​కు సమాచారమివ్వకుండా విశ్వవిద్యాలయం పరిధిలో ఖననం చేయడం మరో నేరమని ఆరోపించారు. జరిగిన సంఘటనపై కనీస చర్యలు మాని.. కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేయడం గాని, గోమాత యజమానికి నష్టపరిహారం చెల్లించకపోవడంపై నాయకులు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details