ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జన జాగరణ సమితి ఆందోళన

రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫీజుల నియంత్రణ చట్టం హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి విశాఖలో ఆందోళన చేపట్టింది.

By

Published : Mar 6, 2019, 12:33 PM IST

విశాఖలో జన జాగరణ సమితి ఆందోళన

రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫీజుల నియంత్రణ చట్టం హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి విశాఖలో ఆందోళన చేపట్టింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్​లో ఇష్టారాజ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా పేద , మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏ రాజకీయ పార్టీ అయితే ఫీజుల నియంత్రణ చట్టం హామీలు మేనిఫెస్టోలో పెట్టకుండా ఉంటుందో ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు అని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలని కోరారు.

విశాఖలో జన జాగరణ సమితి ఆందోళన

ABOUT THE AUTHOR

...view details