ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మన్యంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐకాస బంద్​ - jac bandh in visakha tribal

విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఐకాస ఆధ్వర్యంలో రెండో రోజు బంద్​ జరుగుతోంది. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. జీవో నెం 3 ను పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ఐకాస కోరుతోంది.

jac bandh in tribal areas for go no 3 issue
జీవో నెం 3 పునరుద్ధరణకు జేఏసీ డీమాండ్​

By

Published : Jun 18, 2020, 12:50 PM IST

విశాఖ మన్యంలో రెండో రోజు బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. జీవో నెం 3 పునరుద్ధరించాలంటూ గిరిజన ఐకాస ఆధ్వర్యంలో మన్యంలో 48 గంటల బంద్​కు పిలుపునిచ్చారు. రెండో రోజు వ్యాపారులు స్వచ్ఛందంగా వారి దుకాణాలు మూసేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిలో అడ్డంకులు ఏర్పాటు చేశారు. జీవో నెం 3 పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని గిరిజన నాయకులు డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details