ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 31, 2021, 7:11 AM IST

ETV Bharat / state

ins airavat: కొవిడ్ సామగ్రితో వియత్నాం చేరిన ఐఎన్​ఎస్ ఐరావత్

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ కొవిడ్ సామగ్రితో వియత్నాం చేరుకుంది. సాగర్ మిషన్​లో భాగంగా ఈ సామగ్రిని భారత్.. వియత్నాంకు పంపింది.

ins iravat reached viyatnam
ins iravat reached viyatnam

కొవిడ్ సామగ్రితో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఐరావత్ వియత్నాం సిటీ పోర్ట్​కు చేరింది. 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ 300 ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను ఈ నౌక భారత్ నుంచి వియత్నాంకు జల రవాణా చేసింది. సాగర్ మిషన్లో భాగంగా ఈ సామగ్రిని భారత్ ఆ దేశానికి పంపింది.

దేశీయంగా తయారైన తూర్పు నౌకాధళానికి చెందిన ఐరావత్ విశాఖ నుంచి ఆగ్నేయ ఆసియా ప్రాంతానికి కొవిడ్ సామగ్రి చేరవేస్తోంది. జకార్తాలో 10 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లను అందించి.. అక్కడి నుంచి వియత్నాం చేరుకుంది.

ఇదీ చదవండి:old school buildings: ఏ నిమిషానికి...ఏదీ కూలునో!

ABOUT THE AUTHOR

...view details