కొవిడ్-19 మహమ్మారిపై పోరులో నిమగ్నమైన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులను... భారత సైనిక దళాలు తనదైన శైలిలో అభినందించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశం ఐక్యంగా తన సత్తాను చాటింది. ఈ మేరకు వారందరికి సంఘీభావం తెలుపుతూ... విశాఖ సాగరతీరంలో రెండు యుద్ధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
విద్యుత్ కాంతుల నడుమ.. కరోనా యోధులకు గౌరవ వందనం
కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడటంలో నిమగ్నమైన వారందరికీ... భారత సైనిక దళాలు వినూత్నంగా గౌరవ వందనం చేశాయి. ఈ నేపథ్యంలో విశాఖ సాగర తీరంలోని యుద్ధనౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Indian Navy Special Tribute To Corona Warriors in visakhapatnam
TAGGED:
corona tribute news in vizag