ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జూకు కరోనా సెగ.. జంతువుల కాలక్షేపానికి ఆటవిడుపు ఏర్పాట్లు

రోజు రోజుకూ కొవిడ్ కల్లోలం సృష్టిస్తోన్న నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలలను మూసివేస్తూ యజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రదర్శన శాలలను నిరవధికంగా మూసివేశారు. జూ మూసివేతతో సందర్శకుల కేరింతలకు అలవాటు పడిన జంతువులు స్థబ్దుగా ఉండటంతో పాటుగా ముభావంగా చెందుతున్నాయి.

By

Published : May 7, 2021, 1:34 PM IST

Published : May 7, 2021, 1:34 PM IST

Updated : May 7, 2021, 6:48 PM IST

జూకు కరోనా సెగ.. జంతువుల కాలక్షేపానికి ఆటవిడుపు ఏర్పాట్లు
జూకు కరోనా సెగ.. జంతువుల కాలక్షేపానికి ఆటవిడుపు ఏర్పాట్లు

జూకు కరోనా సెగ

రోజు రోజుకూ కొవిడ్ కల్లోలం సృష్టిస్తోన్న నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలలను మూసివేస్తూ యజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రదర్శన శాలలను నిరవధికంగా మూసివేశారు. జూ మూసివేతతో సందర్శకుల కేరింతలకు అలవాటు పడిన జంతువులు స్థబ్దుగా ఉంటున్నాయి.

కరోనా వల్లే జూలో ఆటవిడుపు..

జూల్లో జంతువులు ఢీలా పడటం గమనించిన రాష్ట్ర అటవీ శాఖ, వాటిల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు చర్యలు చేపట్టాయి. ఆటవిడుపు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో జంతువుల ఆటవిడుపు కోసం ఎన్​క్లోజర్​ల్లో పలు ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఫలితంగా జంతువులన్నీ వాటితో ఆడుతూ ఆహ్లాదంగా గడుపుతున్నాయి.

'పటిష్ట చర్యలు'

కరోనా కల్లోలం సందర్భంగా జంతువుల ఆరోగ్య సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిపుణులైన డాక్టర్లు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పీసీసీఎఫ్ ఎన్​.ప్రతీప్ కుమార్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

కూలీగా సీపీఐ నేత నారాయణ

Last Updated : May 7, 2021, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details