ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరిగిన నాటుసారా కేసులు..సబ్​ జైలుకు నిందితులు - విశాఖ గ్రామీణ జిల్లా

జిల్లాలో నాటుసారా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ అక్రమ అమ్మకాలను నిరోధించేందుకు ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

vishaka district
పెరిగిన నాటుసారా కేసులు..సబ్ జైలు వద్ద క్యూలు

By

Published : Jul 18, 2020, 11:56 PM IST

విశాఖ గ్రామీణ జిల్లాలో నాటు సారా అమ్మకాలు జోరందుకున్నాయి. నాటు సారా అమ్ముతూ పట్టుబడే వారికి బెయిల్ మంజూరులో నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో పట్టుబడిన నిందితులను రిమాండు నిమిత్తం సబ్ జైలుకు తరలిస్తున్నారు. వీరికి సకాలంలో బెయిల్ రాక రిమాండులో ఉంటున్నారు. చోడవరం సబ్ జైలులో 52 మంది నిందితులు రిమాండ్​లో ఉన్నారు. వీరిలో 45 మంది నాటు సారా అమ్మి పట్టుబడిన వారే కావడం విశేషం.

రిమాండులో ఉన్న తమ వాళ్లను చూసేందుకు బంధువులు చోడవరం సబ్ జైలుకు తరలి వస్తున్నారు. కోవిడ్19 నిబంధనలతో అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారు. అయినా రోజూ జైలు వద్దకు వస్తున్నారు.

ఇదీ చదవండిఉత్తరాంధ్రపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?: మంత్రి అవంతి

ABOUT THE AUTHOR

...view details