విశాఖ జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతిగృహాలు 55 ఉండగా అందులో కళాశాలలకు సంబంధించినవి 23 ఉన్నాయి. కళాశాల విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక వసతి గృహాలు లేకపోవడంతో పదోతరగతి విద్యార్థులున్న వసతి గృహాల్లోనే కొన్ని గదులను వీరికి కేటాయించి నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల అద్దె భవనాలు తీసుకుని వసతి కల్పిస్తున్నారు. ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ విద్యార్థులను ఒకేచోట ఉంచడం వల్ల వసతి సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో డిపార్ట్మెంటల్ అటాచ్డ్ హాస్టల్స్ (డీఏహెచ్) పేరుతో కళాశాల వసతిగృహాలకు సొంత భవనాలను మంజూరు చేసింది. ఒక్కో వసతి గృహానికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల చొప్పున ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను కేటాయించింది. జిల్లాలో ఏడు వసతిగృహాలకు ముందుగా రూ.37 కోట్లు మంజూరు చేశారు. వైకాపా సర్కారు అధికారంలో వచ్చిన తరువాత జూన్లో మరోసారి వీటి అంచనా విలువలను పెంచి రూ.48.57 కోట్లతో కళాశాల నిర్మాణాలకు పరిపాలనా ఆమోదం ఇచ్చింది. ఇదే సర్కారు ఈ పనులను ఇప్పుడు రద్దు చేయడం విశేషం.
మొదటికొచ్చిన వసతి కష్టాలు