విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగడ - డుడుమా జలపాతం రోడ్డుపై బండరాళ్లు దొర్లి రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ఈ దారి నుంచే ప్రజలు పనస, గతురుముండా, దొరగుడా, ఒనకడిల్లి, మాచకుండ్, లమతపుట్టు గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. విద్యార్థులు రోజు 2కిలోమీటర్లు నడుచుకుంటూ సంగడ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బండరాళ్లు రోడ్డు పైకి దొర్లినా.. పట్టించుకోరా? - ap latest
భారీ వర్షాలకు రోడ్డుపై కూలిన బండరాళ్ల వల్ల విశాఖపట్నం జిల్లాలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐదు రోజులైనా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

బండరాళ్లు రోడ్డు పైకి దొర్లిన పట్టించుకోవటం లేదు!
రోడ్డు పైకి దొర్లిన బండరాళ్లు..పట్టించుకోని అధికారులు
ఇవీ చదవండి...చిట్టడవులు@ఇమ్పోర్ట్ ఫ్రమ్ జపాన్