రహదారి గండిపడటంతో అత్యవసర రోగిని జేసీబీ సహాయంతో అవతలి ఒడ్డుకి చేర్చారు. విశాఖ జిల్లా ధారకొండ-గుమ్మిరేవుల రహదారిలో కొంగపాకలు వద్ద రహదారికి గండిపడింది. అదే సమయంలో గుమ్మిరేవుల పంచాయతీ నేలజర్తకు చెందిన గిరిజన మహిళ అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఈ మేరకు స్పందించిన స్థానికులు.... గండిపూడ్చటానికి వచ్చిన జేసీబీ తొట్టెలో ఆమెను ఎక్కించి సహాయం అందించారు. వర్షాలు పడితే రహదారికి గండిపడుతుందని... రాకపోకలు నిలిచిపోతున్నాయి ప్రయాణికులు అంటున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆనారోగ్య మహిళకు జేసీబీ సహాయం - విశాఖలో ఆనారోగ్య మహిళకు జేసీబీతో సహాయం
ఆనారోగ్యంతో ఉన్న మహిళను అర్జెంట్గా ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. ఓ పక్క గండి పడిన రహదారి.. మరో పక్క ఆరోగ్యం బాగాలేని మహిళ. అప్పుడే స్థానికులు స్పందించారు. జేసీబీతో సహాయం చేశారు.
![ఆనారోగ్య మహిళకు జేసీబీ సహాయం Helping the sick woman with jcb at kongapakala, visakhapatnam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7859043-1060-7859043-1593676668810.jpg)
ఆనారోగ్య మహిళకు జేసీబీతో సహాయం
Last Updated : Jul 2, 2020, 5:24 PM IST