విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలకు దాతలు ఉదారంగా సహాయం అందించారు. స్థానిక వ్యక్తి నాగరాజు వీరందరికీ నెలకు సరిపడా నిత్యావసర సరకులు అందించారు. బియ్యం, పప్పులు ఇలా 18 రకాల వస్తువులు ఉచితంగా అందించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా పేద కార్మికుల జాబితాను రప్పించుకున్నారు. అన్నీ ఒక సంచిలో వేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
పేదలుకు ఆపన్నహస్తం... 18 రకాల వస్తువులు పంపిణీ - helping poor in lock down time at yalamanchili
లాక్డౌన్ సమయంలో పేదలను.. దాతలు ఆదుకుంటున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలిలో నాగరాజు అనే వ్యక్తి పేదలుకు 18 రకాల వస్తువులు పంపిణీ చేశారు.

ఎలమంచిలిలో దాతలు సాయం కిట్లు పంపిణీ