ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్రోణి ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మన్యంలో రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.

By

Published : Jul 26, 2019, 7:57 PM IST

విశాఖ మన్యం

ద్రోణి ప్రభావంతో విశాఖ మన్యంలో భారీ వర్షాలు

విశాఖ మన్యంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ద్రోణితో వానలు పడుతున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో గురువారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గలా లక్ష్మీపురం పంచాయతీ నుండి బుంగపుట్టు వెళ్లే మార్గంలో వాగు పొంగటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సరిహద్దులోని ఒడిశా రాష్ట్రం మల్కాన్​గిరి జిల్లాకు చెందిన నాలుగు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details