విశాఖ జిల్లా కసింకోట మండలం ఏనుగుతుని గ్రామంలో అమ్మ ఒడి డబ్బులు అడిగినందుకు రూపేష్ అనే విద్యార్థిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డీవీవీ శర్మ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంఈఓ దివాకర్ విచారణ చేపట్టారు. నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి పంపడం తో ప్రధానోపాధ్యాయులు డీవీవీ శర్మను సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి.
విద్యార్థిపై చేయి చేసుకున్న ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్ - ఏనుగుతునిలో విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడు న్యూస్
అమ్మ ఒడి డబ్బులు అడిగినందుకు విద్యార్థిపై చేయి చేసుకున్న ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థిపై చేయి చేసుకున్న ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్