ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దివ్యాంగుడి ఔదార్యం: పోలీసులకు శానిటైజర్లు అందజేత

By

Published : Apr 30, 2020, 4:36 PM IST

కరోనాపై పోరులో శ్రమిస్తున్న విశాఖ పోలీసులకు ఓ దివ్యాంగ బాలుడు మాస్కులు, శానిటైజర్లు అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. కంచరపాలెం స్టేషన్​కు వెళ్లి సిబ్బందికి స్వయంగా వాటిని అందించాడు.

పోలీసులకు శానిటైజర్ల అందజేత
పోలీసులకు శానిటైజర్ల అందజేత

కరోనాపై అలుపెరగకుండా పోరు సాగిస్తున్న విశాఖ పోలీసులకు దివ్యాంగ బాలుడు మాస్కులు, గ్లౌజులు అందించాడు. ఏడో తరగతి చదువుతున్న మూల దినేశ్ అనే బాలుడు తన తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో మాస్కులు కొనుగోలు చేసి పోలీసులకు అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. కంచరపాలెం పోలీసు స్టేషన్​కు వెళ్లి సిబ్బందికి వాటిని అందిచారు. లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని దినేశ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details