ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2020, 9:51 AM IST

Updated : Oct 17, 2020, 11:34 AM IST

ETV Bharat / state

విశాఖలో దుకాణాలు కూల్చేసిన జీవీఎంసీ అధికారులు

విశాఖ ఆంధ్రయూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మార్గంలో ఉన్న దుకాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణ బాబు...జీవీఎంసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారుల చర్యలను ఖండించారు.

విశాఖలో దుకాణాలను కూల్చేసిన జీవీఎంసీ అధికారులు
విశాఖలో దుకాణాలను కూల్చేసిన జీవీఎంసీ అధికారులు

విశాఖలో దుకాణాలు కూల్చేసిన జీవీఎంసీ అధికారులు

విశాఖ ఆంధ్రయూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మార్గంలో ఉన్న దుకాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. నీటి పారుదల శాఖకు చెందిన ఆ స్థలంలో సుమారు అరవై ఏళ్లుగా చిరు వ్యాపారులు ఉంటున్నారు. అయితే స్థల ఆక్రమణ కింద జీవీఎంసీ అధికారులు శనివారం దుకాణాలు కూల్చేశారు.

కనీసం నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు కూల్చడం వల్ల తమ కుటుంబాలు రోడ్డు పాలయ్యారని దుకాణాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పాలని అధికారులను నిలదీశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు ఈ పని చేశారని వారు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు కూల్చివేయటం దారుణమని మండిపడ్డారు. అధికారులను చర్యలను ఖండించారు.

ఇదీ చదవండి

తొట్లకొండ బౌద్ధ క్షేత్రం భూములపై స్టేటస్ కో ఉత్తర్వులు

Last Updated : Oct 17, 2020, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details