ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 3, 2021, 9:47 AM IST

ETV Bharat / state

పారిశుద్ధ్య పనుల తీరుపై జీవీఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

నగరంలో జరుగతున్న పారిశుద్ధ్య పనులను.. విశాఖ మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడారు.

gvmc commissioner
పారిశుద్ధ్య పనులు ఆకస్మిక తనిఖీలు చేసిన జీవీఎంసీ కమిషనర్

విశాఖలో పారిశుద్ధ్య పనులను జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి.. ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూడో వార్డు పెద్దజాలరిపేట పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అక్కడ నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి వారి స్పందన తెలుసుకొని, అందుకు అనుగుణంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సామాజిక మరుగుదొడ్లను పరిశీలించారు.

వాటిని ప్రజలు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని... శానిటరీ ఇన్​స్పెక్టర్లకు స్పష్టం చేశారు. అక్కడ సముద్రంలో కలుస్తున్న మురుగు నీటిని ఎస్టీపీలకు మళ్లించటానికి ఉన్న అవకాశాలను తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details