తెలుగు కనిపించాలి.. తెలుగు వినిపించాలి.. కోర్టులో తీర్పయినా, కలెక్టర్ కార్యాలయంలో ఆదేశాలైనా అన్ని తెలుగులో ఉండాలని జాతీయ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలో ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన... తెలుగు భాష గొప్పతనాన్ని, కాపాడుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిన పనిని వివరించారు. న్యాయస్థానంలో వాదనలు తీర్పులు తెలుగులోనే ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మన భాషను విరివిగా ఉపయోగించాలన్నారు. సామాన్యుడు వచ్చినప్పుడు వారికి తెలిసిన భాషలో సేవలందించినప్పుడే నిజమైన భాషాభిమానం వ్యక్తమవుతుందన్నారు. ఆంగ్లంలో లాటిన్ పదాలు ఎన్నో ఉన్నాయని అలాగే తెలుగులోనూ చాలా భాషలు మిలితం అయ్యాయన్నారు. అందరూ తెలుగుకు సేవ చేయాలన్నారు.
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలి...: సుద్దాల - government works are doing in telugu is the true service of telugu language said by sudhala ashok teja
తెలుగు భాషకు సేవంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో...కోర్టులలో తెలుగులోనే వినిపించటమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. సామాన్యుడుకి అర్ధమైనప్పుడే భాష బతుకుతుందని తెలిపారు.
![ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలి...: సుద్దాల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4285033-376-4285033-1567142996677.jpg)
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలంటున్న సుద్దాల అశోక్ తేజ
ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే సాగాలంటున్న సుద్దాల అశోక్ తేజ
Last Updated : Aug 30, 2019, 3:46 PM IST