ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 9, 2021, 8:48 AM IST

ETV Bharat / state

కాకినాడ సీపోర్టులో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు అనుమతి

కాకినాడ పోర్టులో ఎల్‌ఎన్‌జీకి అనుమతులు ఇస్తూ.. ఏపీ మారిటైం బోర్డుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Kakinada Port
కాకినాడ పోర్టు

కాకినాడ పోర్టులో ఎల్‌ఎన్‌జీ రిసీవింగ్‌, రీ గ్యాసిఫికేషన్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు ఈస్ట్‌కోస్ట్‌ కన్‌సెషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈసీపీఎల్‌)కు కంఫర్ట్‌ లెటర్‌ను జారీ చేయడానికి ఏపీ మారిటైం బోర్డుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌)తో కుదుర్చుకున్న రాయితీ ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ కొనసాగించేలా ఈసీపీఎల్‌కు వెసులుబాటు కల్పించింది. దీనివల్ల కొత్తగా ఒప్పందం కుదుర్చుకునే సంస్థ, ఏపీ మారిటైంతో కలిసి ఈపీసీఎల్‌ కొనసాగటానికి అవకాశం ఏర్పడుతుంది. టెర్మినల్‌ అభివృద్ధికి రూ.1,600 కోట్లను ఈసీపీఎల్‌ పెట్టుబడిగా పెడుతుంది.

ABOUT THE AUTHOR

...view details