ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2020, 7:55 PM IST

ETV Bharat / state

విశాఖ మన్యంలో గంజాయి పట్టివేత

విశాఖపట్నం జిల్లా సీలేరు ఏజెన్సీలో గంజాయి తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు అంతర్రాష్ట్ర వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ganjai seized in manyam vizag district
విశాఖ మన్యంలో గంజాయి పట్టివేత

తెలంగాణలోని హైదరాబాద్​కు చెందిన రాకేష్ , హ‌నుమ‌కొండకు చెందిన నయీమ్​... గంజాయితో రాష్ట్ర పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన గూడెంకొత్తవీధి మండలం దారకొండలో 200 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. ఆ సరకును టాటా సుమోలో తరలిస్తుండగా... జెన్‌కో చెక్​పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details