విశాఖజిల్లా పెందుర్తిలో విషనాగులు హల్చల్ చేశాయి. శారదా పీఠంలోకి , ప్రశాంతి నగర్ సబ్బవరం ఎండీవో ఆఫీస్ వద్దకు విషనాగులు వచ్చాయి. భయాందోళనకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
పెందుర్తిలో విషనాగుల హల్చల్ - snakes in pendurthi
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు విషనాగులు బుసలు కొడుతూ కనిపించాయి. ఇక అంతే అక్కడి వారికి పై ప్రాణాలు పైనే పోయాయి. పాములు చూసిన వారు స్నేక్ క్యాచర్కు ఫోన్ చేసి రప్పించారు. వాటిని పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
![పెందుర్తిలో విషనాగుల హల్చల్ four snakes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7677150-150-7677150-1592533081093.jpg)
పెందుర్తిలో విషనాగుల హల్చల్
పాములన్నింటినీ చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రోజే ఇలా నాలుగు విష నాగులు రావటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'నాపై నమోదైన కేసును ఎత్తివేయండి'