ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గల్లంతైన నలుగురు మత్స్యకారులు సురక్షితం - fishermen safe in kakinada

సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన నలుగురు జాలరులు సురక్షితంగా కాకినాడ జెట్టీకి చేరుకున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

Four fishermen are safe in kakinada jetty
గల్లంతైన నలుగురు మత్స్యకారులు సురక్షితం

By

Published : Oct 23, 2020, 10:34 PM IST

విశాఖపట్నం జిల్లా పెద్ద జాలరిపేటకు చెందిన గల్లంతైన నలుగురు మత్స్యకారులు సురక్షితంగా కాకినాడ జెట్టీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం రెండు గంటల సమయంలో చేపల వేటకు వెళ్లిన వీరు... సాయంత్రం వరకు ఇంటికి చేరుకోకపోవటంతో కుటుంబసభ్యులు స్థానిక మెరైన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా... గుర్నాథరావు, వీర్రాజు, అచ్యుతరావు, అప్పలరాజు సురక్షితంగా కాకినాడ జెట్టీకి చేరినట్టు పోలీసులు సమాచారం ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details