ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేజోన్‌ ఏర్పాటులో రాష్ట్రం చొరవ చూపడం లేదు.. భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ - Railway zone

Railway zone విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చొరవ చూపడంలేదని భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ ఆరోపించారు. విశాఖలో రైల్వే జోన్‌ అవసరాలకు 25 ఎకరాల స్థలం అడిగితే ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. 2020-21 బడ్జెట్​లో 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం కేటాయించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్
New Railway Zone In AP

By

Published : Sep 30, 2022, 10:13 AM IST

New Railway Zone In AP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంఖుస్థాపన త్వరలోనే జరుగుతుందని భాజాపా ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్​ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు లేకపోతే, నిధులు ఎందుకు కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. నిరాధారమైన లీక్​ల ఆధారంగా ఆవాస్తవ కథనాలు వస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని రైల్వేమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లామని తెలిపారు. విశాఖలో 25 ఏకరాల స్థలాన్ని దక్షిణ కోస్తా రైల్వేకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు స్పందించలేదని మాధవ్ ఆరోపించారు. 2020-21 బడ్జెట్ లో రూ. 175 కోట్లు ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఇచ్చామన్నారు. ర్యాక్ సమస్య వల్ల కొత్త రైలు మొదలుకావడం ఆలస్యమైందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details