2016లో తుని వద్ద జరిగిన రైలు దగ్ధం కేసుకు సంబంధించి.. విచారణ నిమిత్తం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఆర్పీఎఫ్ రైల్వే స్టేషన్కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 33 మందిని అధికారులు విచారించారు. కేసు విచారణకు హాజరు కావాలని గత నెలలో ఆర్పీఎఫ్ సిబ్బంది నోటీసు ఇవ్వడంతో పద్మనాభం.. గురువారం విచారణకు హాజరయ్యారు.
విచారణ కోసం అనకాపల్లికి మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం - తుని ఘటన
రైలు దగ్ధం కేసులో విచారణ నిమిత్తం విశాఖపట్నం జిల్లా అనకాపల్లి రైల్వేస్టేషన్కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం హాజరయ్యారు. ఆర్పీఎఫ్ సిబ్బంది ఇచ్చిన నోటీసులతో ఆయన.. విచారణకు వచ్చారు.

విచారణ కోసం అనకాపల్లికి మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం