ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాత స్పందించారు.. కూలీల ఆకలి తీర్చారు - vizag latest news

వలస కూలీల కష్టాలు చూసి దాతలు స్పందిస్తున్నారు. విశాఖ మీదుగా కాలినడక ఒడిశా వెళ్తున్న వలస కూలీలకు నగరానికి చెందిన ఆలివర్​ రాయ్ అనే దాత ఆహారం అందించారు. కూలీలకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి స్వస్థలాలకు పంపారు.

దాతలు స్పందించారు.. కూలీల ఆకలి తీర్చారు
దాతలు స్పందించారు.. కూలీల ఆకలి తీర్చారు

By

Published : May 30, 2020, 1:22 PM IST

విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు కాలినడకన వెళ్తున్న వలస కూలీలకు దాతలు అండగా నిలుస్తున్నారు. విశాఖ నుంచి తగరపువలస మీదుగా ఒడిశా వెళ్లే కార్మికులకు ఓ ప్రైవేట్ విద్యాసంస్థ అధినేత ఆలివర్ రాయ్ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు ఆలివర్ రాయ్..​ భోజనం, బిస్కెట్స్, అరటి పండ్లు, నీరు ఏర్పాటు చేశారు. తగరపువలస నుంచి వారి సొంత ఊళ్లు చేరుకునేందుకు పోలీసుల సహాయంతో.. ప్రయాణఖర్చులు ఇచ్చి లారీల్లో పంపించారు.

ABOUT THE AUTHOR

...view details