ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి మంటలు... ఆహుతైన దుకాణం

ఓ కిరాణా దుకాణంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక దళం వచ్చేలోపే దుకాణం పూర్తిగా దగ్ధమైపోయింది.

By

Published : May 29, 2019, 12:22 PM IST

దుకాణంలో అగ్నిప్రమాదం

విశాఖ జిల్లా మాడుగుల మండలం జమ్మాదేవిపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి షాట్ సర్క్యూట్​తో గ్రామంలోని ఓ కిరాణా దుకాణం పూర్తిగా దగ్ధమైంది. అందులోని సామగ్రి, సరకులు, రిఫ్రిజిరేటర్, నగదు కాలిబూడిదయ్యాయి. జీవనాధారణమైన దుకాణం మంటలకు ఆహుతి కావడం వల్ల యజమాని తవ్వా సత్యారావు కన్నీటి పర్యంతమయ్యారు. అగ్నిమాపక శకటం వచ్చినప్పటికీ దుకాణం పూర్తిగా కాలిపోయింది. లక్ష రూపాయల వరకూ ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు.

కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details