నర్సీపట్నంలో తెదేపా వర్గీయుల ఇళ్లు దగ్ధం - fire
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘంలోని పీనారిపాలెం వద్ద తెదేపా మద్దతుదారులకు చెందిన 2 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 2 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు.
![నర్సీపట్నంలో తెదేపా వర్గీయుల ఇళ్లు దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2991993-thumbnail-3x2-fire115.jpg)
నర్సీపట్నంలో తెదేపా వర్గీయుల ఇళ్లు దగ్ధం.
నర్సీపట్నంలో తెదేపా వర్గీయుల ఇళ్లు దగ్ధం..
విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘంలోని పీనారిపాలెం వద్ద తెదేపా మద్దతుదారులకు చెందిన 2 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు 2 లక్షలకు పైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. ఇంటికి గొళ్లెంపెట్టి కావాలనే నిప్పు పెట్టి ఉంటారని బాధితులు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబాలను తెదేపా నాయకుడు చింతకాయల విజయ్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు 25 కిలోల చొప్పున బియ్యం, 10 వేల నగదు అందజేశారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.