ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తల్లడిల్లిన కుటుంబం.. కరోనాతో తండ్రి, అనారోగ్యంతో కుమారుడు మృతి - పాడేరులో తండ్రి కుమారుడు మృతి

కరోనాతో ఆ ఇంటి పెద్ద మృతి చెందాడు. భార్య, పెద్ద కుమారుడికి పాజిటివ్ రావటంతో కొవిడ్ కేర్ సెంటర్​లో చికిత్స పొందుతున్నారు. ఇంటి వద్ద ఉన్న చిన్న కుమారుడికి పచ్చకామెర్లు సోకాయి. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే నాన్నను కోల్పోయి... అమ్మ, అన్నయ్యలకు కరోనా సోకటంతో అతను ఒంటరివాడు అయ్యాడు. వాళ్లను తలుచుకుంటూ కన్నుమూశాడు.

father died with corona son died due to unillness in paderu in vizag district
కరోనాతో తండ్రి, అనారోగ్యంతో కుమారుడు మృతి

By

Published : Aug 26, 2020, 4:57 PM IST

విశాఖ మన్యం పాడేరులో 15 రోజుల కిందట రత్నం అనే అటవీశాఖ ఉద్యోగి కరోనాతో మృతిచెందారు. అతని కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. భార్య, పెద్ద కుమారుడికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. చిన్న కుమారుడు కామేష్​కు నెగటివ్ వచ్చింది. బాధితులు ఇద్దరూ కొవిడ్ కేర్ సెంటర్​లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న చిన్న కుమారుడు కామేష్​కు పచ్చ కామెర్లు సోకాయి. అతను చికిత్స కూడా తీసుకున్నాడు.

అయితే తండ్రి కరోనాతో దూరం కావడం, అమ్మ, అన్నయ్యలకు అదే వైరస్ సోకటంపై అతను ధైర్యం కోల్పోయాడు. అదే దిగులుతో ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం చికిత్స పొందుతూ అకస్మికంగా మృతిచెందాడు. అతనికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. భర్త, చిన్న కుమారుడు చనిపోవటంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది. అందరితో చలాకీగా ఉండే కుర్రాడు హఠాత్తుగా మృతిచెందటంపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details