ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 1, 2020, 3:22 PM IST

ETV Bharat / state

'ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు... మీరైనా ఆదుకోండి సార్!'

జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ తాండవ సమీపంలో మాధవనగర్ నిర్వాసితులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

Farmers giving the land for  Tandava reservoir have been asked to help the government at thandava in visakhapatnam
Farmers giving the land for Tandava reservoir have been asked to help the government at thandava in visakhapatnam

తాండవ జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు... న్యాయం చేయాలని కోరుతూ విశాఖ జిల్లా నాతవరం మండలం తాండవ సమీపంలోని మాధవనగర్ నిర్వాసితులు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయానికి వినతిపత్రం అందించారు.

జలాశయం నిర్మాణంలో భూములు పోయిన సుమారు 150 మందికి మాత్రమే పట్టాలిచ్చారని... మిగిలిన వారికి ఇవ్వలేదని వాపోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చిన రైతు భరోసా, విత్తనాలు, ఎరువులు తదితర రాయితీలను పొందలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

దీనిపై స్థానిక ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించినప్పటికీ ప్రయోజనం లేదని అంటున్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:'మమ్మల్ని త్వరగా భారత్​కు తీసుకెళ్లండి'

ABOUT THE AUTHOR

...view details