ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలం పాకల వద్ద రైతు హత్య..? - narsipatnam latest crime news

పాలేరుగా పనిచేస్తున్న చిరంజీవి అనే రైతు శుక్రవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. గుర్తించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

farmer murdered at fields in narsipatnam mandal
పొలం పాకల వద్ద హత్యకు గురైన రైతు

By

Published : May 16, 2020, 10:16 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గురందొరపాలెం గ్రామానికి చెందిన చిరంజీవి (50) అనే రైతు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన కేదారి శెట్టి రాము అనే రైతు వద్ద పాలేరుగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే మధ్యాహ్నం భోజనం ముగించుకుని పొలంలో పనుల పర్యవేక్షణకు వచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో పొలం పాకల వద్ద చిరంజీవి హత్యకు గురైనట్లు స్థానికులు గమనించారు. గ్రామస్థులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతని భార్య, ఇద్దరు కుమార్తెలు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పొలం పాకల వద్ద హత్యకు గురైన రైతు

ABOUT THE AUTHOR

...view details