విశాఖ మన్యంలో గంజాయి నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులు గ్రామగ్రామాన అవగాహన కల్పిస్తున్నారు. గత వారంలో జిల్లా అధికారులతో కమిషనర్ ఎంఎం నాయక్ సమావేశం నిర్వహించి.. గంజాయి నిర్మూలనకు కార్యాచరణ రూపొందించారు. నాట్య కళాకారులతో అవగాహన కల్పిస్తున్నారు. గిరిజనులను ఓ చోట చేర్చి పాటలు, నృత్యాలతో ప్రదర్శనలు ఇస్తున్నారు. మన్యం నుంచి గంజాయిని శాశ్వతంగా నిర్మూలించాలనే తపనతో జి.మాడుగుల మండలం పరదనిపుట్టులో గంజాయిని పండించకుండా.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి గౌరవంగా జీవించవచ్చని సూచించారు.
గంజాయి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు - visakha
గంజాయి నిర్మూలనకు అబ్కారీ అధికారులు నడుం బిగించారు. విశాఖ మన్యంలో గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
![గంజాయి నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3932939-1059-3932939-1563966643008.jpg)
గంజాయి