ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2020, 11:19 PM IST

ETV Bharat / state

'విశాఖ జిల్లాలో పాజిటివ్ కేసుల వివరాలను వెల్లడించండి'

విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల వివరాలు వెల్లడించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ విమర్శించారు. ఓ వృద్ధురాలికి వైద్యులు కరోనా పాజిటివ్​గా నిర్ధరించినా....ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని అరోపించారు.

ex mla critises on govt about corona cases list in vizag
విశాఖలో పాజిటీవ్ కేసుల వివరణ ఇవ్వండి

విశాఖ జిల్లాలో కరోనా కేసుల వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. అనకాపల్లి నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ వివరాలు చెప్పకపోవడం వల్ల అయోమయం నెలకొందన్నారు. వివరాలు వెల్లడించి ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి గోప్యంగా ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కసింకోట మండలంలో ఒక వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు నిర్ధరించినా అధికారికంగా ప్రకటించకపోవడం దారుణమన్నారు.

ఇదీ చూడండి కరోనా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుందాం'

ABOUT THE AUTHOR

...view details