ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖ వైకాపా నేతల తీరు సిగ్గుచేటు' - lg polymers latest news update

ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధలో ఉంటే వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకొవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యే చొరవతో పరిహారం వచ్చిందని పాలాభిషేకాలు చేసుకోవడం సిగ్గు చేటన్నారు.

ex mla bandaru satyanarayana murthy
మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి

By

Published : May 19, 2020, 8:58 AM IST

ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తే, వైకాపా కార్యకర్తలు సంబరాలు చేసుకోవడాన్ని తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. బాధితులు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధలో ఉంటే ఇదేం పని అని ప్రశ్నించారు.

వైకాపా ఎమ్మెల్యే చొరవతో పరిహారం వచ్చిందని పాలాభిషేకాలు చేసుకోవడం.. ఆ పార్టీ నేతలకు సిగ్గు చేటు అని విమర్శించారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించిన 94వ వార్డు వైకాపా కార్యకర్తలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details