ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 850 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ పేర్కొన్నారు. నర్సీపట్నం నుంచి కృష్ణదేవిపేట రహదారి విస్తరణకు రూ.13 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన తెలిపారు.
నర్సీపట్నం-కృష్ణదేవిపేట రహదారి విస్తరణకు శంకుస్థాపన - vizag district n3ews today
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి కృష్ణదేవిపేట వరకు చేపట్టిన రహదారి విస్తరణ పనులను స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు.

నర్సీపట్నం-కృష్ణదేవిపేట రహదారి విస్తరణకు శంకుస్థాపన