ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషిచేయాలి: ఎస్పీ కృష్ణారావు - ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషిచేయాలి

విశాఖ జిల్లాలో మొదటి విడత అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు సిబ్బంది చొరవ చూపాలని వివరించారు.

Elections should be held peacefully
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కృషిచేయాలి: ఎస్పీ కృష్ణారావు

By

Published : Feb 8, 2021, 11:30 AM IST

విశాఖ జిల్లా రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2 వెల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. అనకాపల్లి ఎన్​టీఆర్ క్రీడా మైదానంలో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ప్రత్యేక చొరవ చూపాలని సిబ్బందికి సూచించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎలాంటి చిన్న సంఘటన జరిగిన వెంటనే మొబైల్ టీం స్థానిక పోలీస్ స్టేషన్ సెల్​కి సమాచారం అందించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ సిబ్బంది చొపవ చూపాలని వివరించారు.

ఇదీ చదవండి: మంత్రుల నోటీసులపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణకు స్వీకరణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details