విశాఖ జిల్లా అనకాపల్లి 83వ వార్డు జనసేన-భాజపా ఉమ్మడి అభ్యర్థి మంగ విజయభాను తరపున జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను గెలిపించి.. అభివృద్ధికి దోహదపడాలని భాస్కరరావు ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన యువకులను కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
'జనసేన-భాజపా అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి' - janasena spokes person news
మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. జీవీఎంసీ ఎన్నికల్లో భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు కోరారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారం