ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 17, 2020, 10:51 PM IST

ETV Bharat / state

నెలాఖరు నాటికి నాడు- నేడు పనులు పూర్తిచేయాలి: ఈఈ

పాఠశాలలో చేపట్టిన నాడు-నేడు పనులపై సమగ్ర శిక్షణ ఈఈ సరసింహరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలు మేరకు ఈనెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ee review meeting on naadu-nedu
నాడు-నేడు పనులపై సమగ్ర శిక్షణ ఈఈ సరసింహరావు సమీక్ష


పాఠశాలలు అభివృద్ధికి చేపడుతున్న నాడు- నేడు పనులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని సమగ్ర శిక్షణ ఈఈ డి.నరసింహరావు సూచించారు. విశాఖ జిల్లా చీడికాడలోని మండల పరిషత్ కార్యాలయంలో వివిధ పాఠశాల హెచ్.ఎంలతో నాడు- నేడు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. సమీక్షలో మండల విద్యా శాఖాధికారి గంగరాజు, ఇంజనీర్ చైతన్యతోపాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details