విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలెం ప్రాంతంలో కరోనా కేసుల కారణంగా... ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. మార్కెట్లోని వర్తకులు, కార్మికులు... 80 శాతం మంది అక్కడి నుంచే యార్డుకి వస్తుంటారు. దీంతో బెల్లం మార్కెట్లోని అమ్మకాలు నిలుపుదల చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. సడలింపులు వచ్చాక తిరిగి తెరుస్తామని పేర్కొన్నారు.
కరోనా ఎఫెక్ట్: మూతపడిన అనకాపల్లి బెల్లం మార్కెట్ - అనకాపల్లి కరోనా కేసులు వార్తలు
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్లో బెల్లం అమ్మకాలు నిలిపేస్తున్నట్టు మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించారు. మార్కెట్కి వచ్చే వర్తకులు, కార్మికులు కంటైన్మెంట్ జోన్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

due to corona Anakapalli jaggery market was Closed in visakhapatnam district